టెన్త్ విద్యార్థులకు అలర్ట్ : రిజల్ట్స్ తేదీ ప్రకటించిన విద్యాశాఖ

by Sathputhe Rajesh |   (  Updated:2023-04-14 13:17:19  IST  )

ఏపీ టెన్త్ పరీక్షలు -2023 ఫలితాల గురించి బోర్డు కీలక అప్ డేట్ ఇచ్చింది.

టెన్త్ విద్యార్థులకు అలర్ట్ : రిజల్ట్స్ తేదీ ప్రకటించిన విద్యాశాఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ టెన్త్ పరీక్షలు -2023 ఫలితాల గురించి బోర్డు కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈనెల 18తో పదో తరగతి పరీక్షలు ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 19 నుంచి 26 వరకు మూల్యాంకనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 30 నుంచి 35 వేల మంది మూల్యాంకనం చేపట్టనున్నారు. వాల్యూవేషన్ పూర్తయిన తర్వాత మే రెండో వారంలో పదో తరగతి ఫలితాలు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే స్టేట్ లో మొత్తం 3,349 కేంద్రాల్లో 6.64లక్షల మంది విద్యార్థలు టెన్త్ పరీక్షలు రాస్తున్నారు.

Also Read..

సీఎం జగన్‌కు థ్యాంక్స్: Mla Kotam Reddy

Next Story